చిరువ్యాపారస్తులకు అండగా నిలిచిన బొమ్మిడి నాయకర్

నరసాపురం:శనివారం కేపీ పాలెం బీచ్ పేరుపాలెం బీచ్ లో ఉన్న షాపులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఒక పది రోజులు ముందు షాపుల వాళ్లకి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా షాపుల్ని జెసిబి లతో పడగొట్టడం జరిగినది. ఒక్క రెండు రోజులు టైం ఇవ్వమని మన నర్సాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ చైర్మన్ బొమ్మిడి నాయకర్ అడిగిన టైం ఇవ్వకుండా పడగొట్టడం జరిగినది. కేవలం వైసీపీ ప్రభుత్వం చిన్నచిన్న వ్యాపారస్తులను కూడా వదలకుండా నిర్లక్ష్యంగా షాపుల్ని కూల్చడం అనేది చాలా బాధాకరమైన విషయం అని బొమ్మిడి నాయకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అందే వెంకటలక్ష్మి, అందే దొరబాబు, కుమ్మరి పురుగు రాంబాబు, ఇంజేటి దానం, వనమాల శ్రీను, ఉప్పులూరి రాంబాబు, బళ్ళ హనుమంతు, నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.