కోడుమూరులో “నా సేన కోసం నా వంతు”

కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీకి అండగా తమ వంతు బాధ్యతగా విరాళాలు అందించే కార్యక్రమమే “నా సేన కోసం నా వంతు”. ఈ కార్యక్రమంలో భాగంగా గూడూరు నగర పంచాయతీ నందు కర్నూలు జిల్లా ముఖ్య నేత, పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింతా సురేష్ బాబు ఆదేశాల మేరకు ఆకెపోగు రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం గూడూరు నగర పంచాయతీలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం అభిమానులు జనసైనికులు వీర మహిళలు ప్రజలు స్వచ్ఛందంగా, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు, జనసేన పార్టీ బలోపేతం కోసం విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు ఆకెపోగు రాంబాబు, పైగేరి చిన్న ఎల్లప్ప, పసుల గజేంద్ర, ఈరపోగు రాజు, కర్నూలు జిల్లా జనసైనికుడు శావాల నరసప్ప, నందికొట్కూరు నియోజకవర్గ నాయకులు జనసేన రాము, జనసైనికులు పాల్గొనడం జరిగింది.