రాజమహేంద్రవరం సిటీ జనసేన ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

  • క్రియాశిలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రాజమహేంద్రవరం సిటీ, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డులో రామాలయం దగ్గర జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా పోగ్రామ్ కమిటీ సభ్యులు పొన్నాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఆయన చేతుల మీదుగా పొన్నాడ శ్రీను ఫ్రెండ్ సర్కిల్ కి జనసేన క్రియాశీల సభ్యత్వం కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి విశేషణ స్పందన వచ్చింది అందరూ వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు ఇటువంటి కార్యక్రమం చేసిన పొన్నాడ శ్రీనుని అనుశ్రీ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ(బుల్లి), మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శులు నల్లంశెట్టి వీరబాబు, పైడి రాజు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యదర్శులు అల్లాటీ రాజు, గుణం శ్యామ్ సుందర్, విన్న వాసు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త కార్యదర్శులు దేవికివాడ ఫణీ, పొట్లూరి శ్రీనివాసరావు, వేణుగోపాల్, రాజమహేంద్రవరం జనసేన పార్టీ స్థానిక నాయకులు సంజీవి, విక్టరీ వాసు, రాంబాబు, ఏ.డి ప్రసాద్, కోటి, అజయ్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గజ్జరపు సూరిబాబు, కటారి శ్రీను ఎం బద్రి, వేణు, నాని, స్థానికులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.