ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడు ఇంటికి వెళ్లిన నాదెండ్ల – 5 లక్షల చెక్కు అందజేత

జగ్గంపేట నియోజకవర్గంలోని జె.కొత్తూరుకి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు శ్రీ కొండపల్లి వెంకటేశ్వర్లు ఇటీవల ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పరామర్శించి రూ.5 లక్షల భీమా చెక్కు అందించారు.