జనసేన తీర్ధం పుచ్చుకున్న పెండ్యాల నరేష్

*జనసేనానికి అండగా మేమూ నిలబడతాం, బండారు శ్రీనివాస్ నాయకత్వానికి, పలివెల గ్రామ జనసైనికులకు జై కొడతాం – పెండ్యాల నరేష్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, పలివెల గ్రామానికి చెందిన పెండ్యాల నరేష్, జనసేన కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జి బండారు శ్రీనివాస్ సమక్షంలో ఆదివారం జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.. జనసేనాని పవన్ కళ్యాణ్ సారథ్యంలో బండారు శ్రీనివాస్ నాయకత్వంలో పని చేస్తామని, నీతికి నిజాయితీకి నిలబడడమే ఒక నాయకుడి గొప్పదనమని, అలాంటి నాయకుడు జనసేనాని అని, వీరి అడుగుజాడల్లో నడవడానికి మేముసైతం అంటూ, మా గ్రామ జనసైనికులతో జనసేన పార్టీకి మద్దతుగా, బలోపేతం చేయడానికి, కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చానని, కొత్తపేట నియోజకవర్గం రథసారథి బండారు శ్రీనివాస్ నాయకత్వం ఎంతో గొప్పగా పటిష్టమైన రీతిలో ఉన్నదన్నారు. అన్ని వర్గాలను ఆదరించి ముందుకు తీసుకెళుతున్న గొప్ప నాయకుడిగా, జనసేన పార్టీ ఎంతో బలోపేతమైనదిగా బండారు శ్రీనివాస్ నాయకత్వం ఉండదని, వారి నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వంగా ఉందని, ఈ సందర్భంగా జనసేన కండువాను భుజాలపై వేసి, పార్టీలో చేర్చుకున్నందుకు, పార్టీ ఇన్చార్జ్ నాయకుల బండారు శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. బండారు వెంట నడుస్తూ, పార్టీకి వీర విధేయుడిగా సేవలు అందిస్తామని నరేష్ తెలియజేసారు.