ఓటుకు నోటు కేసు.. ఏసీబీ కోర్టు విచారణ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. నిన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం స్టీఫెన్‌సన్ గన్‌మెన్‌లు నీరజ్‌రావు, రఘునందన్ సాక్షి వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది. ఉదయ్ సిన్హా, సెబాస్టియన్ విచారణకు హాజరు కాగా, రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య గైర్హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి అప్పటి గన్‌మెన్‌లను నేడు విచారించనుంది. కాగా, ఈ నెల 13 వరకు 18 మంది సాక్షులను విచారించి వాంగ్మూలం నమోదు చేసేందుకు న్యాయస్థానం ఇప్పటికే షెడ్యూలు ఖరారు చేసింది.