కల్వల కార్తీక్ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం

జనగామ: కల్వల కార్తీక్ వర్ధంతి సందర్భంగా వారి స్నేహితులు కర్రె వీరస్వామి, నాగుల రాకేష్, ఎండి అక్బర్ ఆధ్వర్యంలో శనివారం వృద్ధులకు అన్నదానం చేయడం, అదేవిదంగా జనగామ ఏరియా హాస్పిటల్ లోని పండ్లు పంపిణీ కార్యక్రమం, జనగామ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వరి అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసి, పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాధ వృద్దులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. వృద్ధులను చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వృద్ధులకు సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, మామిండ్ల సాయిరాం, రంజిత్, జోగు ఉదయ్, శివ, గుజ్జుల నాలిన్, రోహిత్, వాసిం, నామాల సిద్ధులు గౌడ్, మను, నాని, ఆలకుంట్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.