అకామిడేషన్ కమిటీని అభినందించిన పవన్ కళ్యాణ్

ఎచ్చెర్ల నియోజకవర్గం:  వారాహి యాత్ర తొలి విడతను విజయవంతం చేసినందుకు అకామిడేషన్ కమిటీ ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన నాయకులు డా. విశ్వక్ సేన్ కమిటీ సభ్యులను పేరు పేరునా పలకరిస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వారాహి విజయ యాత్రను దిగ్విజయం చేసేందుకు క్షేత్ర స్థాయిలో పార్టీ అంతర్గత సభ్యులు చేసిన కృషి, పడిన కష్టం కళ్ళారా చూశాను, మీ కష్టం వృథా పోదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర వేస్తుంది.. యాత్ర తొలి విడతను విజయవంతం చేయడంలో భాగమైన కమిటీలకు కృతజ్ఞతలు. మీ అందరి కృషి సహకారంతో యాత్ర విజయవంతంగా ముగించాం. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మలివిడత యాత్రను కూడా ఇదే పట్టుదలతో మనందరం కలిసి విజయవంతం చేద్దాం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన నాయకులు డా విశ్వక్షేణ్ మాట్లాడుతూ వారాహి యాత్రలో భాగమైన కమిటీలలో సభ్యునిగా నాకు బాధ్యతను అప్పగించినందుకు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పార్టీ అధిష్టానానికి ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన శ్రేణులు తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నాకు ఎటువంటి బాధ్యతలను అప్పగించినా నిబద్దతతో నిర్వహిస్తాను అని తెలియజేసారు.