కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవా కార్యక్రమాలు

★ నవ వధువుకు బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు అందజేత

విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో డాక్టర్ కందుల నాగరాజు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. ఈ సందర్భంగా నవవధువు వరలక్ష్మీదేవికి బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధి అన్నారు. ప్రజలకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి సుప్రయోజనాలు ఆశించకుండా ప్రజలందరికీ నిస్వార్ధంగా సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నవ వధువుకు చేయూతనివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నళినిదేవి, కిరణ్ ప్రసాద్, యజ్ఞశ్రీ, వర, శ్రీదేవి, కోదండమ్మా, జాన్సీ, వాణి, లుక్స్ గణేష్, రేణు, గాజుల శ్రీను, ప్రసాద్, సతీష్, కోమలి, లలిత, పద్మ, కుమారి, జనసేన యువనాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.