సీఐ కిరణ్ కుమార్ రెడ్డిని సత్కరించిన పామిడి మండల జనసేన

పామిడి మండలం: పోలీసు వ్యవస్థ మీద ఉన్న అపారమైన గౌరవంతో ఎందుకంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆ వ్యవస్థ అంటే జనసేన నాయకులకు అపారమైన నమ్మకం మరియు గౌరవం. అందుకే పోలీసు వారిని గౌరవంగా ఆహ్వానించటం, గౌరవించుకోవటం వారి బాధ్యతగా తలంచి కొత్తగా బాధ్యతలు తీసుకున్న సీఐ కిరణ్ కుమార్ రెడ్డిని పామిడి మండల జనసేన పార్టీ తరఫున మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో పూలమాలతో సత్కరించి రాబోవు కాలంలో జనసేన పార్టీ తరఫున చేసే ప్రజాపోరాటాలపై సమస్యలపై జనసేన చేపట్టబోయే కార్యక్రమాలకి రాజ్యాంగబద్ధంగా పోలీస్ శాఖ వారు తమ వంతు సహకారాన్ని అందించి రాజ్యాంగ విలువలను అలాగే శాంతి భద్రతలను కాపాడి.. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవనం కొనసాగించేలా చర్యలు చేపట్టాలని గౌరవనీయులైన సిఐని జనసేన పార్టీ పామిడి మండల అధ్యక్షుడు ధనుంజయ్ కోరడం జరిగినది. వారు ఎంతో ఆప్యాయంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ప్రతిపక్షాలకు మీకు ఉన్నటువంటి హక్కులను కాపాడుతూ శాంతిభద్రతలను కాపాడుతూ ముందుకు వెళ్లే విధంగా మీరందరూ మాకు సహకరించవలసిందిగా కోరారు. అందుకు మా వంతుగా పూర్తిగా రాజ్యాంగ విలువలను కాపాడడానికి సహకరిస్తామని సిఐ కు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పామిడి మండల ప్రధాన కార్యదర్శులు జగదీష్, శేక్షావలి, ధను క్షత్రియాస్ మరియు కార్యదర్శులు లాలూ స్వామి, రాము, ఖాజావళీ ఉరవకొండ, అబ్దుల్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.