ప్రజల సేవ కోసం పవన్.. రాటాల రామయ్య

  • పవనన్న ప్రజాబాట కార్యక్రమం 48వ రోజు

ఒంటిమిట్ట: రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి, వస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు మంగళవారం పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నేడు 48వ రోజుకు చేరుకుందన్నారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఒంటిమిట్ట మండలం సాలబాదు పంచాయతీలోని రామకృష్ణ నగర్ లో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ, పవనన్న ప్రజాబాట సాగిందని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలు తీరాలంటే ప్రజలందరూ, జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని రాబోయే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.