దర్శి నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో జనసేనాని వేడుకలు

దర్శి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు మరియు ప్రకాశం జిల్లా లీగల్ సెల్ సభ్యులు వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా దర్శికి విచ్చేసిన దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజుకి వారి సోదరులు ఆమంచి స్వాములుకి వరికూటి అభిమానులు మరియు జనసైనికులు ఘన స్వాగతం పలికడం జరిగింది. దర్శి గడ్డ జనసేన అడ్డా అని మరొక్కసారి నిరూపించిన దర్శి నియోజకవర్గ జనసైనికులు మరొక్కసారి దర్శి మొత్తం జనసేన జెండాలతో నిండిపోయిన వైనం. ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్న వీర మహిళలు మరియు దర్శి నియోజకవర్గ పవన్ కళ్యాణ్ అభిమానులు. వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో దర్శిలోని వరికూటి నాగరాజు క్యాంప్ కార్యాలయం వద్ద నిర్వహించిన బ్లడ్ క్యాంప్లో జనసైనికులు ఉత్సాహంగా పాల్గొని భారీ సంఖ్యలో డొనేట్ చేయడం జరిగినది. రాజంపల్లిలో జనసైనికుల మరియు వీర మహిళల సమక్షంలో జన సందోహంలో జనసేన జెండాను ఆవిష్కరించిన దర్శి నియోజకవర్గ జనసైనికులు వరికూటి నాగరాజు, ఆమంచి స్వాములు అనంతరం దర్శిలో భారీ ర్యాలీని నిర్వహించి దర్శి గడియార స్తంభం వద్ద 50 కేజీల భారీ కేక్ ను అభిమానుల మధ్య కట్ చేయడం జరిగినది.