మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.. బత్తుల

  • జనం కోసం జనసేన.. మహాపాదయాత్ర 45వ రోజు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, అచ్చియపాలెం గ్రామంలో జరిగిన జనం కోసం జనసేన.. మహాపాదయాత్ర 45వ రోజు కార్యక్రమంలో భాగంగా.. జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి గ్రామంలో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ.. పాదయాత్ర ఉత్సాహంగా గ్రామంలో పూర్తి అయ్యింది. జిల్లాలోనూ, నియోజకవర్గంలోనూ శివారు గ్రామమైన అచ్చిపాలెం ప్రజల సైతం ఈ వైసీపీ పాలనపట్ల పూర్తిగా విసుగుచెంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం, జనసేన ప్రభుత్వం కోసం వారే స్వచ్ఛందంగా ఎదురు చూస్తున్నామని చెప్పడం ఈ పాదయాత్రలో హైలైట్. ఈ సందర్భంగా పలువురు వైసీపీకి చెందిన యువకులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, వీరికి బత్తుల దంపతులు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు… గ్రామంలో జనసేన క్యాలెండర్లు, కరపత్రాలు పంచుతూ జనసేన పార్టీ విధివిధానాలను ప్రజలకు అర్థమయ్యే రితీలో సాగిన ఈ కార్యక్రమం విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు..!!