ఫ్యాను గుర్తుకు ఓటేసిన ప్రజలను ఈరోజు ఫ్యాన్ వేసుకోకుండా చేస్తున్నారు: బొబ్బేపల్లి సురేష్

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కేంద్రంలోని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు బొబ్బేపల్లి సురేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాదయాత్రలో ప్రజల కష్టాలు నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ కల్లబొల్లి మాటలు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ప్రజలను దోచుకోవడం తప్ప ఏం వెలగబెట్టారు అంటూ ఆయన మండిపడ్డారు. ఫ్యాను గుర్తుకు ఓటేసిన ప్రజలను ఈరోజు ఫ్యాన్ వేసుకోకుండా చేస్తున్నారు అని అన్నారు, పెరిగిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి లేదంటే ప్రజలకు అండగా నిలబడి పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, సందీప్, శ్రీహరి, వంశీ, బిక్కీ దయాకర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.