పౌరసరఫరాల్లో జాప్యం, అవకతవకలపై సబ్ కలెక్టర్ కి వినతిపత్రం

పార్వతీపురం, మన్యం జిల్లాలో జరుగుతున్న పౌరసరఫరాల్లో జాప్యం, అవకతవకలపై సబ్ కలెక్టర్ కి జనసేన నాయకులు వినతిపత్రం అందించడం జరిగింది. లబ్ధిదారులకు డీలర్లు ప్రజాపంపిణీ విషయంలో చేస్తున్న జాప్యంపై జోక్యం చేస్కుని సరుకుల పంపిణి సకాలంలో జరిగేలా చూడమని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్రకార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, మన్యం జిల్లా నాయకులు పైల సత్యనారాయణ, వంశీ, ఉపేంద్ర, రమేష్ పాల్గొనడం జరిగింది.