జనరంజక పాలన జనసేనతోనే సాధ్యం: కొండిశెట్టి ప్రవీణ్

  • జనసేన నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనుని జన్మదిన వేడుకలు
  • కేక్ కటింగ్, ఉచిత రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షల శిభిరం, పార్టీకి విరివిగా విరాళాలు

సింగనమల: భావి తరాల భవిష్యత్తును కోరే వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమేనని జనసేన నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలో జనసేన పార్టీ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని పార్టీకి విరివిగా విరాళాలు పంపించారు. అనంతరం ఉచితంగా రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షల శిభిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వారి రక్త గ్రూపుని తెలియజేశారు. ఈ సందర్బంగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తును కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమేనని ప్రజలు విశ్వసిస్తున్నారని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ చీడని వదిలించి 2024లో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ బాటలో నడిపించడానికి రాష్ట్ర ప్రజానీకం కంకణం కట్టుకున్నారని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తుపాకుల భాస్కర్, రహమతుల్లా, రామయ్య, బాబావలి, చింతా రామకృష్ణ, విజయ్, చిన్నా, బాబా నజీర్, అశోక్, గిరీష్, నరసింహా, పవన్, కళ్యాణ్, అన్సర్, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.