కేంద్ర మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న రాష్ట్రపతి.. కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణం

కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఢిల్లీలోని రాజ్ భవన్ లో కొనసాగుతోంది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు హాజరయ్యారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన నేతలు కూడా విచ్చేశారు.

కేబినెట్ మంత్రులుగా ఇప్పటి వరకు ప్రమాణం చేసిన వారిలో కిషన్ రెడ్డి, నారాయణ్ రాణే, శర్వానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధియా, రాంచంద్ర ప్రసాద్ సింగ్, అశ్వినీ వైష్ణవ్, పశుపతి కుమార్ పరాస్, కిరణ్ రిజిజు, రాజ్ కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి, మన్ సుఖ్ మాండవీయ, భూపేంద్ర యాదవ్, పురుషోత్తం రూపాలా, అనురాగ్ సింగ్ ఠాకూర్, పంకజ్ చౌధురి, అనుప్రియ సింగ్ పటేల్, సత్యపాల్ సింగ్ భగేల్, రాజీవ్ చంద్రశేఖర్, శోభ కరంద్లాజే ఉన్నారు.