పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని.. కాకినాడ జనసేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

కాకినాడ సిటి నియోజకవర్గం, పెంచిన కరెంట్ చార్జీలు, దానికి తోడు పవర్ హాలిడేని నిరసిస్తూ.. తక్షణం కరెంట్ సరఫరా మెరుగుపరచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించి పవర్ హాలిడేని ఉపసంహరించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాకినాడ సిటి జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పిలుపు మేరకు జనసేన నాయకులు పెద్దిరెడ్డి రాజేష్ మరియు పెద్దిరెడ్డి సంతోషి ఆధ్వర్యంలో 23వ డివిజన్లో ఆందోళన కార్యక్రమం చేపట్టగా.. దీనికి కాకినాడ సిటి నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షుడు సంగిసెట్టి అశోక్ నాయకత్వం వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సంగిసెట్టి అశోక్ పవర్ హాలిడే వలన పేద ప్రజల ఉద్యోగాలు పోతున్నాయనీ, జీతాలు రాకపోతే కుటుంబాలని ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలటం సత్య, జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ మరియు జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.