సభలో అడుగు పెడుతున్న మేడిచేర్ల సత్యవాణి రాము కి రాజోలు జనసేన శ్రేణుల శుభాకాంక్షలు

రెండు తెలుగు రాష్ట్రాల జనసైనికుల మరియు వీరమహిళల తరుపున హృదయపూర్వక శుభాకాంక్షలు
తూర్పుగోదావరి జిల్లా, మండల ప్రజా పరిషత్ సమావేశ సభా మందిరంలో అడుగు పెడుతున్న జనసేన పార్టీ తొలి మహిళా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు

రాజోలు నియోజకవర్గంలో మలికిపురం మండలంలో రామరాజులంక గ్రామం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఒక సాధారణ మహిళల జనసేన పార్టీ అధ్యక్షుడి సిద్దాంతాలు, ఆశయాలకు ఆకర్షితురాలు అయి నిబద్దతతో వీరమహిళగా జెండా భుజాన వేసుకుని తిరిగి ఈ రోజు యావత్ మహిళ లోకానికి ఆదర్శంగా నిలిచింది, కన్నవారి సహకారం అత్తింటి వారి అండదండలు భర్త ఇచ్చే భరోసా మరియు రాజోలు నియోజకవర్గం ప్రజల ఆదరాభిమానాలు, మద్దతు, స్వతహాగా కష్టపడే తత్వం సాధించాలి అనే పట్టుదల సేనానికి అండగా నిలబడాలి అనే బలమైన సంకల్పం అన్ని కలగలిపితే ఈ రోజు జనసేన పార్టీ తొలి మహిళా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి మేడిచేర్ల సత్యవాణి రాము. విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్న కూడా
గృహిణిగా సంప్రదాయాలను గౌరవిస్తూ భర్త అడుగుజాడల్లో నడిచి ఒక్కసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఇంకేముంది అంతా షరా మామూలే ఈ పురుష ఆహంకార సమాజంలో అవాకులు చెవాకులు, అవమానాలు పొగడ్తలు అన్నిటి సమానంగా తీసుకుని సేనాని నిర్ణయమే శిరోధార్యం అని వడి వడిగా అడుగులు ముందుకు వేస్తూ పట్టుదలతో దైర్యంగా నిలబడి ప్రత్యర్ధుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ విజయాన్ని అందుకున్న వీరమహిళ ఈ అదృష్ట లక్ష్మి జనసేన పార్టీ తరపున తూర్పుగోదావరి జిల్లా మండల ప్రజా పరిషత్ సమావేశ సభా మందిరంలో అడుగు పెడుతున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మరియు రాజోలు నియోజకవర్గ జనసైనికులు, వీరమహిళల తరుపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నందుకు మిక్కిలి గర్విస్తున్నాము.