యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) లో రాజంపేట జనసేన నేత ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనసేన నాయకులు, జనసైనికుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగాయి. కార్య్క్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ చేసిన యల్లటూరు శ్రీనివాస రాజు
అనంతరం అందరికీ స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ జెడ్పీటీసి షబ్బీర్ అహ్మద్, పత్తి నారాయణ, పివి ఆర్ కుమార్, గురివి గారి వాసు భీమినేని రమేష్, ఆకుల చలపతి, పత్తి వెంకట సుబ్బయ్య, మౌల, నాసర్ ఖాన్, ఆకుల మారయ్య, శంకర రాజు, రాజా ఆచారి, సుబ్రమణ్యం, వీరయ్య, పెంచలయ్య, వంశీ, రోషన్, శెట్టం రవి, సురేష్, మురళి, మంజు నాథ్, సాయి రాజు, మల్లి కార్జున, శింగమలసాయి తదితరులు పాల్గొన్నారు.