తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నహెచ్ బి కాలనీ వాసులు

  • సమస్య పట్టించుకోని అధికారులు
  • సమస్య పరిష్కారం కోసంకృషి చేస్తానని తిరుపతి అనూష బరోసా

విజయవాడ: భవానీపురం 42వ డివిజన్ హెచ్ బి కాలనీ 450,300 ఎస్.ఎఫ్.టి బ్లాక్ లలో గత వారం రోజుల నుంచి త్రాగునీరు రావటం లేదు. ఈ సమస్యతో స్థానిక మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికార వైసీపీ మాత్రం సోద్యం చూస్తుండటమే కాకుండా నేను ఇక్కడ ప్రెసిడెంట్ ని మీరేదన్నా ఉంటే నాకు చెప్పాలని లేదంటే వాటర్ పైపులను డమ్మీ చేపిస్తాను అని, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు స్థానికులను బెదిస్తున్నారు. అంటే స్థానికులకు మంచినీళ్లు లేకుండా ఉండాలని అంటున్నారు అని జనసేన పార్టీ 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష ప్రశ్నిస్తూ.. ఈ సమస్యపై కార్పొరేషన్ అధికారులతో మాట్లాడతానని, సమస్య పరిష్కారం కోసంకృషి చేస్తానని అనూష తెలియజేశారు.