ఆర్టీసీ, విద్యుత్ చార్జీల మోత తగ్గించాలని కదిరి జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ

పేద, మధ్య తరగతి ప్రజల మీద ఆర్టీసీ, విద్యుత్ చార్జీల భారం మోపుతూ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ” బాదుడే బాదుడు” అంటూ.. కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ ఆధ్వర్యంలో రోడ్లు భవనాలు అతిథి గృహం నుంచీ, ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి.. ఆ తర్వాత డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద, మద్య తరగతి రవాణా సాధనం ఆర్టీసీ బస్సు అని, ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు పెరగటం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు అని, ఆ రోజు మన ముఖ్యమంత్రి మాది ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి, ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసుకుని ఈ రోజు డీజల్ రేట్ పెరిగింది అని డీజల్ సెస్ పేరుతో ఆర్టీసి ఛార్జీలు పెంచడం న్యాయమా అని వారు ప్రశ్నించారు..పేద, మధ్యతరగతి ప్రజల కోసం డీజిల్ సబ్సిడీని ప్రభుత్వమే భరించి ఆర్టీసి చార్జీలు తగ్గించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళతామని తెలియజేశారు. పాదయాత్రలో, ఓదార్పు యాత్రలో, అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఈ రోజు ఆస్తి పన్ను, చెత్త పన్ను, అలాగే నవరత్నాలకు కూడా.. రకరకాల నిబంధనలు పెట్టి తూట్లు పొడుస్తూ.. ఎగ్గొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా మానుకోవాలని లేదంటే ప్రజావ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కదిరి రూరల్ మండల అధ్యక్షులు చిల్లా మహేష్, చలపతి, రవీంద్ర నాయక్, లక్ష్మీ ప్రసన్న, జిల్లా కార్య నిర్వహణా కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల,రమణ, అనుప్రసాద్, కిన్నెర మహేష్, శేఖర్, నాగేంద్ర ప్రసాద్, రామనప్ప, నవీన్, దినేష్, ప్రసాద్, భాస్కర్, గణేశ్, మునెప్ప, నాగరాజు, గోవిందు, ఆంజనేయులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.