మైలవరం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

మైలవరం: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జనసేన శ్రేణులు మైలవరంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన శ్రీ పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ భావాల పట్ల ఆకర్షితులై స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహ కాలంలో జైలు శిక్ష కూడా అనుభవించారని, భాషా ప్రయుక్త రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. జనసేన ప్రభుత్వం ఏర్పడిన తరువాత సంక్షేమ పథకాలకు స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెడతామని, స్వాతంత్ర సమరయోధులు, మహనీయులను గౌరవించే పార్టీ జనసేన పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మైలవరం మండల ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, గుమ్మడి శ్రీనివాసరావు, మరియు నాయకులు తోట మాధవరావు, వీర్ల పౌల్ రాజ్, చిట్టిమాదా వెంకటకృష్ణ, పసుపులేటి నాగరాజు, కస్తాల రవి, కస్తాల పూర్ణచంద్రరావు, మత్తి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.