ప్రజలందరికీ శ్రీ శుభకృత్ శుభాకాంక్షలు

మన తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది శుభకృత్ నామధేయంతో తరలి వచ్చింది. పేరులోనే శుభాలను ఇనుమడింపచేసుకున్న ఈ శుభకృత్ ఉగాది ప్రజలందరికీ శుభాలు కలుగచేయాలని మనసారా కోరుకుంటున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పంటలు పుష్కలంగా పండి రైతులు, సమృద్ధిగా వ్యాపారాలు జరిగి వ్యాపారస్తులు, కార్మికులు, వృత్తి ఆధారిత కళాకారులు సమస్త జనులు సుఖ సంపదలతో విరాజిల్లాలని కోరుకుంటున్నాను. ధరాఘాతాలు, పన్ను పోట్లు లేని పాలనను అందించే విధంగా పాలకులలో కరుణ నింపాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని జనసేనాని తెలిపారు.