బత్తుల ఆధ్వర్యంలో శ్రీ డొక్కా సీతమ్మ నిత్య అన్నదాన శిబిరం

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, వారి పిలుపుమేరకు.. రాజానగరం నియోజకవర్గంలో పాదచారులకు, అభాగ్యులకు, పేదవారికి అన్నం పెట్టి ఆకలి తీర్చాలనే మహా సంకల్పంతో.. నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో వారి ఆర్థిక సహాయ సహకారాలతో.. గత కొన్ని రోజులుగా రాజానగరం నియోజకవర్గంలో విజయవంతంగా నడుస్తున్న శ్రీ డొక్కా సీతమ్మ మహా అన్నదాన శిబిరంలో శుక్రవారం కోరుకొండ మండలం జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఎంతో మందికి భోజనం సమకూర్చి, వారి ఆకలి తీర్చిన బత్తుల బలరామకృష్ణ సైన్యం.