అధికార పార్టీకి కొమ్ము కాస్తూ పోలీసులు చూపుతున్న అత్యుత్సాహం పై జనసేన నిరసన: గాదె

శనివారం, విశాఖపట్నంలో వైసీపీ ప్రభుత్వం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై మరియు మా నాయకులపై పోలీసు వారి చేత అక్రమ వేధింపులకు గురిచేయడం జరిగింది. ఆదివారం గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన లాడ్జి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ మా నాయకులపై అక్రమ వేధింపులకు గురిచేసిన అధికార పార్టీ వారిని అలాగే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగచేయకుండా చూసే పోలీసుల అత్యుత్సాహంపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇలా నిరసన తెలుపుతున్న మా నాయకులను, కార్యకర్తలను, వీరమహిళలను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించడం జరిగింది. వైసిపి పార్టీ వారి మదాన్ని దించే దాకా మా పార్టీ నిద్రపోదని చెప్పారు. భవిష్యత్తు రాజకీయం మొత్తం మా చేతుల్లోకి తీసుకొని మీకు తగిన గుణపాఠాన్ని తెలిపే రోజులు దగ్గరలో ఉన్నాయని అధికార ప్రభుత్వాని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా మరియు నగర నాయకులు, వీరమహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.