టిడిపి మేము సైతం రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బత్తుల

  • తెలుగుదేశం పార్టీ మేము సైతం రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్షాలను భయబ్రాంతులు గురిచేయడానికి, బెదిరించడానికి, భయపెట్టడానికి, దౌర్జన్య కాండ, దుర్మార్గత్వం, నియంత పరిపాలన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీరు అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగానికి విరుద్దంగా చట్టంలో ఉన్న అనుకూల విషయాలను ఆసరాగా తీసుకుని అధికార పార్టీ మితిమీరిన రీతిలో అక్రమ అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు కలిసి “బాబు గారికి తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలు” చేపట్టారు. ఈ సందర్బంగా నిరాహార దీక్షకు రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని తెలుగుదేశం పార్టీ నేతలకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరామ్, యర్రంశెట్టి శ్రీను, ఎం.ఆర్.పి.ఎస్ మాజీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రఘు, తూర్పు గాణుగూడెం సర్పంచ్ గల్లా రంగా, గుళ్ళింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, కమిడి సత్తిబాబు, అక్కిరెడ్డి వేణు, అడపా శ్రీను, ఆనందాల గోవింద్, నాతిపం దొరబాబు, తోట అనిల్ వాసు, తెల్లమేకల శ్రీను, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.