మైనార్టీ ముస్లింలను జగన్ ప్రభుత్వం మోసం చేస్తుంది

ఉదయగిరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మైనార్టీ ముస్లింలకు మోసం చేసిందని ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ జనసైనికుడు మరియు వింజమూరు మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు షేక్ సుభాని భాయ్ పత్రిక విలేకరులతో మాట్లాడుతూ దుల్హన్ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర ఆ నిధులు లేవని ప్రభుత్వ అధికారులు హైకోర్టు కు చెప్పడం జరిగింది. జగన్ రెడ్డి చేతకాని పరిపాలనకు నిదర్శనమని సుభాని మండిపడ్డారు. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం ముస్లింలకు దుల్హన్ పథకం కింద 50 వేలు ఇస్తే 2019లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష రూపాయలు దుల్హన్ పథకం కింద ముస్లిం మైనార్టీలకు ఇస్తాను అని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా దగ్గర దుల్హన్ డబ్బులు లేవు ఇవ్వలేను అని చెప్పడం సరికాదని 90శాతం ముస్లిం ఓట్లతో ముఖ్యమంత్రి అయినా జగన్ మోహన్ రెడ్డి ఆరోజు మాట తప్పడం మడమ తిప్పడం అనడానికి నిదర్శనం. మూడు సంవత్సరాలు పూర్తయి పథకం తీసేయడం ముస్లింలకు అవమానించడం అని తెలియజేసారు. అదే విధంగా యువత ఉపాధి స్టిరపడేందుకు స్వయంఉపాధి కింద ఐదు లక్షలు ఇస్తాను. అన్నారు, ఇంకా ముస్లిం మసీద్ మౌశాన్లకు ఇమమలకు గౌరవ వేతనం కింద పదిహేను వేలు ఇస్తాను అన్నారు. ముస్లిం మైనారిటీలో ప్రమాదవాసతు శనిపోతే 5లక్ష రూపాయలు ఇస్తానన్నారు. హజ్ యాత్రకు యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్ధిక సాయం అందిస్తామని అన్నారు. ఎన్ని హామీలు ఇచ్చి ఏది కూడా ముస్లిం మైనారిలకు ఇవ్వకపోవడం వైసీపీ ప్రభుత్వం చేతకాని అదేవిధంగా రాబోయే ఎన్నికలో అన్ని వర్గాల ప్రజలు బుద్ది చెప్తారని అన్నారు.