ఘనంగా జూబ్లీహిల్స్ బిజెపి-జనసేన ఉమ్మడి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్

తెలంగాణ, బిజెపి-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా నాయకులతో కార్యకర్తలతో వేలాది సంఖ్యలో ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మరియు జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి జనసేన పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. తెలంగాణలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని రాధారం రాజలింగం కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున రాధారం రాజలింగం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.