ప్రధాని పర్యటన గొప్ప ప్రేరణ

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై స్పందిస్తూ, భారత్ బయోటెక్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. “ప్రధానమంత్రి పర్యటన మా శాస్త్రవేత్తల బృందానికి గొప్ప ప్రేరణగా ఉపయోగపడుతుందన్నారు. శాస్త్రీయ ఆవిష్కరణ, ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించడం మరియు కోవిడ్ -19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటం పట్ల మా నిబద్ధతను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ “26,000 మంది కోవాక్సిన్ మూడవ ఫేజ్ ట్రయల్ భారతదేశం అంతటా నిర్వహించబడుతోందని , ఈ టీకా ప్రపంచంలోనే ఏకైక బయో సేఫ్టీ లెవల్ 3 ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి చేయబడుతుందని తెలిపారు.