టిడ్కో గృహాలను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే

తాడేపల్లిగూడెం: పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం టిడ్కో గృహా సముదాయంలో మారం వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కోట్ల రూపాయల ఖర్చుపెట్టి అప్పటి ప్రభుత్వం నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా తాత్సారం చేసి 90 శాతానికి పైగా పూర్తయిన అపార్ట్మెంట్లను సైతం పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. కూటమి అధికారంలోకి రాగానే టిట్కో గృహాలకు కనీస అవసరాలు అయినా త్రాగునీరు డ్రైనేజీ తదితర అవసరాలను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని బొలిశెట్టి హామీ ఇచ్చారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన నిర్మాణాలు పిచ్చి మొక్కలతో పగుళ్ళతో అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఆయన వాపోయారు. కార్యక్రమంలో జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.