క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేసిన తిరుపతి అనూష

విజయవాడ, ప్రియదర్శిని కాలనీలో 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేస్తూ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని 2024లో జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, నీతి నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్క జనసైనికుడు కీలకంగా పనిచేయాలని, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం పోతిన వెంకట మహేష్ గెలుపు కోసం కూడా కృషి చేయాలని, సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వన్డే శాలరీ పార్టీకి విరాళం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేశారు. స్థానిక కార్పొరేటర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని విలేకరుల గురించి, మా నాయకుడు పోతిన వెంకట మహేష్ గురించి మాట్లాడే అర్హత నీకు, లేదని హెచ్చరించారు. విలువలు గురించి నీకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మీ పార్టీలో ఏ ఒక్కరికి మాట్లాడే అర్హత లేదని గుర్తు చేశారు. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ ని అన్ని మాటలు అన్నప్పుడు విలువలు మీకు గుర్తు రాలేదా, ఏ ఎదవ మా నాయకుడికి ప్యాకేజీ ఇచ్చాడు, చూసిన ఎదవ ఎవరో చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు. మీ వరకు వచ్చేటప్పటికి విలువలు, సిద్ధాంతాలు గుర్తొస్తున్నాయా…? కార్పొరేటర్ల ముసుగులో సామాన్య ప్రజల దగ్గర ఏ విధంగా డబ్బులు దండుకుంటున్నారో మాకు తెలుసు. మరి కొద్ది రోజుల్లోనే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.