గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో గాంధీ మహత్మునికి ఘననివాళి

పాలకొండ, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా, పాలకొండ జనసేన పార్టీ కార్యాలయంలో పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు ఆయనను స్మరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం నాగవంసపు జంక్షన్ లో ఉన్న “జాతిపిత మహాత్మా గాంధీ” విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ మహాత్మ గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి శాంతి, అహింస బాట పట్టి బలమైన పోరాటం చేసిన వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఈ భారతదేశంలో పౌరులు ఆయన ఆశయాలను ఆచరణలోకి తీసుకొచ్చి భారతదేశాన్ని ఉన్నతమైన రాజ్యాంగ తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మిడితాన ప్రసాద్, డొంక శివ ప్రసాద్, సతివాడ వెంకటరమణ, గర్భాపు నరేంద్ర, డొంపాక సాయికుమార్, కోడి వెంకటరావు నాయుడు, జల్లూ సాంబాబు, రాజు, రమేష్, సుమన్_అమల, సంతోష్, రాంబాబు, సూర్య, తేజ, నరసింహ, చక్రి, జగదీష్, కురుమినాయుడు, మధు, సంతు, జనసైనికులు పాల్గొన్నారు.