గాంధీ మహాత్మునికి సింగరాయకొండ జనసేన నాయకుల నివాళులు

కొండెపి: శాంతి, అహింస, సత్యం అనే ధర్మాలను ప్రపంచానికి చాటి, బ్రిటీషు అంతటి వారినైనా, శాంతి, అహింస, సత్యంతో ఎదుర్కోవచ్చు అని చేసి చూపించిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ.. సింగరాయకొండ జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 154వ జయంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు గాంధీ గారు తన సుఖమయ జీవితాన్ని సంపాదనను వదిలి ప్రజల్ని చైతన్య పరచి దేశాన్ని రాక్షస పాలన నుండి రక్షించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన సుఖమయ జీవితాన్ని, సంపాదనను వదిలి ప్రజల్ని చైతన్య పరచి రాష్ట్రాన్ని వై స్ జగన్ రాక్షన పాలన నుండి విముక్తి కోసం వచ్చారు అదీ వారి మధ్య సారూప్యత. మహాత్మా గాంధీ 154వ జయంతి కార్యక్రమంలో కార్యక్రమంలో సింగరాయకొండ మండల కమిటీ నాయకులు ఉపాధ్యక్షులు సయ్యద్ చాన్ బాషా, అధికార ప్రతినిధి సంకే నాగరాజు, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, మండల కార్యదర్శులు అనుమల శెట్టి కిరణ్ బాబు, కిచ్చేం శెట్టి ప్రవీణ్ కుమార్, మండల ప్రచార కార్యదర్శి తగరం రాజు, కమిటీ సభ్యులు శీలం సాయి, షేక్ సుల్తాన్ భాష, పి విజయ్ కుమార్, షేక్ మా భాష, మధు, అభి, టీ నితీష్ మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.