అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన యు.పి.రాజు

రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం మంతిన గ్రామంలో ఎనిమిది ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధం అయిన విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్బంగా యు.పి.రాజు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పునరావాస చర్యలు చేపట్టి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేసారు. ఆయనతో పాటు మండల నాయకులు గొర్లె గోవిందరావు, వెంకటనాయుడు, దాలి నాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.