వారాహియాత్ర విజయవంతంకావాలి: కనక దుర్గ

అమలాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రవిజయవంతం కావాలని చిందాడ గరువు ఎమ్ పిటిసి మోటూరి కనకదుర్గ, మోటూరి వెంకటేశ్వరావు ఐ పోలవరం మండలం తిల్ల కుప్ప గ్రామంలో వీరన్న బాబు గద్దె వద్ద పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గద్దె గురువులు పళ్ళ దుర్గా భవాని, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, పలువురు వీర మహిళలు పోల్గొన్నారు.