వాస్కూరి ఆంజనేయులుకు ఘననివాళులర్పించిన బొంతు

రాజోలు నియోజవర్గం: రాజోలు మండలం, బి. సావరం గ్రామంలో కీ.శే వాస్కూరి ఆంజనేయులు కాలం చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు గురువారం వారి నివాసానికి వెళ్లి వాస్కూరి ఆంజనేయులు చిత్రపటానికి ఘన  నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంతం సుబ్బారావు కుమారుడు మేకల ఏసుబాబు, గెడ్డం సుందరరావు తదితరులు పాల్గొన్నారు.