వచ్చే ఎన్నికల్లో మీ ఓటుతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలి

  • జనసేన పల్లెపోరులో బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలం, రాచర్ల గ్రామంలో ముందుగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ నివాళులు అర్పించారు. అనంతరం బుధవారం పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో జరిగిన పల్లెపోరులో భాగంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మీరు ఆలోచించి వేసే ఓటుతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలన్నారు. అంబేద్కర్ సాక్షిగా జనసేనని గెలిపిస్తే ముందుగా రోడ్ల వ్యవస్థను డ్రైనేజీ వ్యవస్థను సరిచేస్తానన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకొని మూడున్నర సంవత్సరాలు అయినా ఇక్కడున్న ఎమ్మెల్యే రాచర్ల గ్రామం మొహం కూడా చూడలేదన్నారు. అంతేకాకుండా ఎస్సి, ఎస్టి నిధులను సొంత ఖర్చులకు ఈ ప్రభుత్వం వాడుకొని మీ అందరిని గాలికి వదిలేసిందన్నారు. అంబేద్కర్ ఆశయాలను అడ్డుపెట్టుకొని మీతో ఓటు వేయించుకొని వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని నట్టేట్లో ముంచిందన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీ ఓటు జనసేనకు వేసి గెలిపించాలని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యఅతిథిగా నరసాపురం నియోజకవర్గం నుంచి విచ్చేసిన చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి మంచి మనిషిని గెలిపించి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఓటు వేసిన పేదలు పేదలుగానే మిగిలిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన, పెంటపాడు అధ్యక్షులు పుల్ల బాబి, స్థానిక నాయకులు గట్టి రామకృష్ణ, కోరుకొండ రవి, గాడి వెంకటరమణ కుమార్, సోమలాపూర్ వీర్రాజు, గాదంశెట్టి వెంకట కుమార్, పసుపులేటి మహేష్, బాదంశెట్టి కిషోర్, కోరుకొండ దుర్గారావు, మామిడి వెంకట్రావు, కేసిరెడ్డి బాలాజీ తదితరులు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.