ఎన్ డి ఎ కూటమిలోకి నేతి ఆంజనేయులును ఆహ్వానించిన యల్లటూరు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం సానిపాయికి చెందిన నేతి ఆంజనేయులు (సర్పంచ్) మరియు వారి సతీమణి రెడ్డమ్మ ఎంపీటీసీ లను రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మరియు రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు వారి ఇరువురికి కండువాలు వేసి కూటమిలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా హాజరైనారు. ఈ కార్యక్రమంలో నేతి రమేష్, రాజానాయుడు, రాజ గోపాల్ నాయుడు, కేశవులు, శివయ్య, చిన్నప్ప, గుగ్గిళ్ల రమణ, రాజయ్య, సుదీర్, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీసర్పంచ్ సమ్నెట శివప్రసాద్, పి వి ఆర్ కుమార్, ఆకుల చలపతి, నాసర్ ఖాన్, పత్తి నారాయణ, శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.