పార్వతిపురం నియోజకవర్గంలో రెండోవిడత గ్రామ బాట
- పార్వతిపురం నియోజకవర్గంలో విజయదశమి సందర్భంగా రెండోవిడత గ్రామ బాట కార్యక్రమం ప్రారంభించిన మండల అధ్యక్షురాలు ఆగూరు మనీ
పార్వతిపురం నియోజకవర్గం: పార్వతీపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదట విడతగ గ్రామబాట కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అంతే దిగ్విజయంగా రెండో విడత గ్రామబాట కార్యక్రమం జరగాలని ఉద్దేశంతో విజయాలను ఇచ్చే విజయదుర్గ దేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ విజయదశమి రోజు రెండో విడత కార్యక్రమం జనసేన నాయుకులు గుంట్రెడ్డి గౌరీశంకర్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షురాలు అగూరు మణి సమక్షంలో కృష్ణపల్లి పంచాయతీ గధబవలస గ్రామం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయుకులు రాజాన బాలు, కర్రీ మణికంఠ, అంబటి బలరాం, అగూరు శ్రీను, బొండపల్లి జనార్థ రావు, ఆగ్గాల నవీన్, రవి, రమేష్, పవన్ కళ్యాణ్, బండపల్లి చంద్ర, శంకర్, సాయి, మహేష్, తాతబాబు, అదే విధంగా రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ సభ్యులు చిట్లు గణేష్వర్రావు మరియు ఆ గ్రామ వార్డ్ సభ్యులు అరిక రాము, గ్రామ జనసైనికులు, ప్రజలు పాల్గొవడం జరిగింది.