బొబ్బేపల్లి సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలం, సర్వేపల్లిలోని జనసేన కార్యాలయం నందు 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. ఎంతోమంది భారతీయులు ప్రాణత్యాగం చేసి బానిస సంకెళ్ల నుంచి భారతీయులని విముక్తిని చేసి ఈనాడు స్వేచ్చా వాయువులతో మనం బతుకుతున్నాం అంటే వాళ్లు ఆనాడు వాళ్ల యొక్క ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ వారిని తరిమికొట్టి మనం ఈనాడు పీల్చుకునే ఈ గాలి ఆనాడు వాళ్లు విడిచిన శ్వాస అదేవిధంగా ఆనాడు ఎంతోమంది పోరాడి స్వాతంత్రాన్ని ఇస్తే నేడు మన స్వార్ధ రాజకీయ నాయకులు వాళ్ల స్వార్థాల కోసం వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారు తప్ప ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు కరువయ్యారు. అదేవిధంగా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలలో కనీస వసతులు కల్పించాలి మరి ఇప్పటికి కనీస వసతులు లేని పరిపాలన కొనసాగుతోంది గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఒక జనసేన తోనే సాధ్యం. సర్వేపల్లిలో సర్వేపల్లి పార్టీ కార్యాలయం నుంచి ఊరు చివర ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు 20 అడుగులు భారీ జాతీయ పతాకాన్ని ఊరేగింపుతో వెళ్లి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, ఖాజా, శ్రీహరి, అశోక్, సంజు రాకేష్, రహమాన్, గిరీష్, తదితరులు పాల్గొన్నారు.