జనసేన జనజాగృతి యాత్ర 81వ రోజు

  • రాజానగరం నియోజకవర్గలో సీటు ఎవరికీ ఇచ్చిన గెలిపించుకుంటాం
  • శ్రీ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తారు అప్పటివరకు అసత్య ప్రచారాలను నమ్మవద్దు… మండపాక శ్రీను

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలంలో జనసేన జనజాగృతి యాత్ర 81వ రోజు కార్యక్రమంలో భాగంగా ఫిలింనగర్ లో 2వ రోజు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ డైనమిక్ లీడర్ &కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన పార్టీ గాజు గ్లాసులు, షణ్ముఖ వ్యూహం కరపత్రాలను ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. అలానే అడుగడుగునా ప్రజల చూపు జనసేనాని వైపే అనే విషయం ప్రజల యొక్క మాటల్లో తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు, అడపా అంజి కోరుకొండ మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి విరపురాజు పోసిబాబు, కోరుకొండ మండలం సోషల్ మీడియా కన్వీనర్ రాచపోతుల సురేష్, కోరుకొండ మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు తెలగంశెట్టి శివ, చదువు ముక్తేశ్వరరావు, తన్నీరు తాతాజీ, స్వామి, సుబ్రహ్మణ్యం, ఆనంద్, శ్రీనివాస్, వీరమహిళలు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.