జనసేనతోనే అవినీతిరహిత పాలన సాధ్యం

  • పవనన్న ప్రజాబాట 34వ రోజు.. ప్రజల్లోకి దూసుకెళ్తున్న రాజంపేట జనసేన

రాజంపేట: జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని రాజంపేట జనసేన నాయకులు అన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 34వ రోజు రాజంపేట మండలంలోని ఆదివారం చవనవారిపల్లె, పంచాయతీ, కొల్లావారిపల్లె పంచాయతీలో ఇంటింటి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన మేనిఫెస్టో సిద్ధాంతాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. జనసేనను ఆదరించడం వల్ల రాబోయే తరాలకు భవిష్యత్తు బాగుంటుందని ప్రజలకు వివరించారు. జనసేన మేనిఫెస్టో సిద్ధాంతాలకు ఆకర్షితులైన అన్ని వర్గాల ప్రజలు పార్టీలోకి వస్తున్నార అన్నారు. పవన్ కళ్యాణ్ తోనే రాష్ట్రంలో మార్పు సాధ్యమవుతుందని ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రాష్ట్ర ప్రజలందరూ నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు మన్నూరు గోపి, తాళ్లపాక శంకరయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీర మహిళలు జెడ్డా శిరీష, బండి లక్ష్మీదేవి, మల్లేశ్వరి, జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.