గొర్రిపూడి గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

కరప మండలం, గొర్రిపూడి గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు అన్నవరం ఆధ్వర్యంలో చేపట్టిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాల్గొని.. సభ్యులకు కిట్లు అందిస్తూ.. వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల అభిప్రాయాలూ, సమస్యలు తెలుసుకుంటూ.. అధైర్యం పడవద్దని రాబోయే కాలంలో జనసేన ప్రభుత్వం వస్తుంది.. పవన్ కళ్యాణ్ గారి పాలనలో మంచి జరుగుతుంది అని తెలియజేసారు..ఈ కార్యక్రమంలో బండారు మురళి, అనుకుల రాంబాబు, గ్రంధియారీష్, నల్లే ప్రసన్న, సింహాచలం, వీరబాబు, ముద్రగడ రమేష్, పడాల నాని, రాజు, వీరబద్రరావు,ముత్యాల రావు, దాసరి శివ, పోసిన రాము, రెడ్డిపల్లి కిషోర్, కుర్ర శరత్ తదితరులు పాల్గొన్నారు.