రోడ్లన్నీ గుంతల మయం

  • కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్

కొత్తపేట, ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా రహదారులు తయారయ్యాయి. అడుగడుగున గుంతలు వాహనదారుల నడ్డి విరిచే‌లా కంకర తేలిన గతుకులుతో రహదారులు చినుకు పడితే చాలు కాలువలుగా, చిత్తడి భూములుగా మారిపోతున్నాయని కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ దుయ్యబట్టారు. ఛిద్రమైన రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జనసేన అధిష్టానం “గుడ్ మార్నింగ్ సీఎం సార్” నిరసనకు ఇచ్చిన పిలుపు మేరకు కొత్తపేట నియోజకవర్గ జనసైనికులు రోడ్డు ఎక్కారు. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రం ఆలమూరు ఆర్ అండ్ బి రోడ్డుపై నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ నేతృత్వంలో పెద్దఎత్తున జనశ్రేణులు హాజరు కాగా నిరసన చేపట్టారు. రోడ్డుపై గుంతలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో గుడ్ మార్నింగ్ సీఎం అంటూ అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్ల దుస్థితి తెలియజేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. దుర్భరమైన రోడ్లపై ప్రయాణిస్తున్న వారు అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాకాలం కావడంతో నీటితో నిండి గుంత ఎదో గొయ్య, ఎదో తెలియక పరిస్థితి మరిదారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం రోడ్లను బాగు చేసే వరకు ఈ ఉద్యమం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు తాళ్ల డేవిడ్ రాజ్, సంగీత సుభాష్, జనసేన మండల అధ్యక్షుడు సూరపురెడ్డి సత్య, గారపాటి త్రిమూర్తులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు సలాది జయప్రకాష్ (జిపి), తోట వెంకటేశ్వర్లు, కొత్తపల్లి నగేష్, నాగిరెడ్డి మహేష్, కుడుపూడి ప్రసాద్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.