విజయవాడ పశ్చిమలో కూటమి ఎన్నికల ప్రచారం

విజయవాడ, జనసేన-టిడిపి బలపరిచిన బిజెపి ఉమ్మడి అభ్యర్థి సత్యనారాయణ(సుజనా) చౌదరి గెలుపు కొరకు ఆయన సోదరి ధనలక్ష్మి, కేశినేని శివనాథ్ (చిన్ని) భార్య జానకి లక్ష్మి పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను కమలం మరియు సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కూటమి అభ్యర్థులు గెలిస్తే పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఉండే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. 47వ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ చిన్న సుబ్బయ్య, జనసేన పార్టీ ప్రచార కమిటి విజయవాడ అర్బన్ కో-ఆర్డినేటర్ తిరుపతి సురేష్, 42వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష పాల్గొని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ కార్యకర్తలు, టిడిపి పార్టీ కార్యకర్తలు, బిజెపి పార్టీ కార్యకర్తలు అత్యధికంగా పాల్గొన్నారు.