కలుషిత నీరు త్రాగి అనారోగ్యంపాలైన వారిని పరామర్శించిన అంజూరు చక్రధర్

శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్, తొట్టంబేడు మండలంలోని చేమూరు గ్రామంలో పర్యటించి, నీటి కలుషితం వల్ల అనారోగ్యంకు గురై విరోచనాలు, వాంతులతో బాధపడుతున్న వారిని కలిసి పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ గ్రామంలో తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంక్ ను శుభ్రపరచాలని సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. అలాగే వైద్యాధికారులతో మాట్లాడి వ్యాధి బారిన పడిన 23మంది ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. వ్యాధితీవ్రత అధికంగా ఉన్న వాళ్ళని గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జనసేన పార్టీ తరపున కోరడమైనది.