మహాత్మాగాంధీకి నివాళులర్పించిన అనుశ్రీ

రాజమండ్రి, ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీకి స్థానిక కంబాల చెరువు వద్ద గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అను శ్రీసత్యనారాయణ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి జనసేన పార్టీ తరపున నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, రాజమండ్రి సిటీ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శులు నల్లంశెట్టి వీరబాబు, పైడి రాజు, రాజమండ్రి సిటీ కార్పొరేషన్ కార్యదర్శి గుణ్ణం శ్యాంసుందర్, రాజమండ్రి సిటీ జాయింట్ సెక్రెటరీ పొట్నూరి శ్రీనివాస్ ఠాగూర్, రాజమండ్రి జనసేన యువనాయకులు బయ్యపునీడి సూర్య, జనసేన నాయకులు ఏ.డి ప్రసాద్, వెంకటేష్, భీమరాజు, శ్రీను మరియు జనసైనికులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.