సచివాలయాల వాలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవం

ప్రత్తిపాడు నియోజకవర్గం: 16వ డివిజన్ లోని బుడంపాడు గ్రామంలోని 195,196, సచివాలయాల వాలంటీర్లుకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 16వ డివిజన్ కార్పొరేటర్, దాసరి వాసు భార్య లక్ష్మీ దుర్గ సచివాలయాల వాలంటీర్లుకు సంభందించి సేవమిత్ర, సేవ రత్న మరియు సేవవజ్ర పురస్కార అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్స్,సేకరేటరీస్, ఇంజినీరింగ్ అధికారులు, సానిటరీ స్టాఫ్ ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగినది.