టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా రెండు బలమైన జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ సిద్దమయ్యాయి. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ఢిల్లీ కూడా జోరుమీదున్నది. రెండు జట్లు సమ ఉజ్జిలుగా ఉండటంతో రసవత్తర పోరు జరగనుంది. గాయం కారణంగా ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు.